రూ. 500 కోట్ల విలువైన స్థలం స్వాధీనం | Sakshi
Sakshi News home page

రూ. 500 కోట్ల విలువైన స్థలం స్వాధీనం

Published Sun, Nov 26 2023 2:10 AM

-

సాక్షి, చైన్నె: ప్రభుత్వానికి చెందిన రూ. 500 కోట్లు విలువైన స్థలాన్ని శనివారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆలందూరు – మౌంట్‌ – పూందమల్లి మార్గంలోని బట్‌ రోడ్డు వద్ద ప్రభుత్వానికి చెందిన ఎకరానికి పైగా స్థలం ఉంది. దీనిని గతంలో లీజుకు తీసుకున్న వారు నిర్మాణాలు సైతం ఈ స్థలంలో చేశారు. లీజు కాలం ముగిసినా ప్రభుత్వానికి అప్పగించ లేదు. దీంతో చెంగల్పట్టు కలెక్టర్‌ రాహుల్‌నాథ్‌ ఆదేశాలతో పల్లావరం తహసీల్దార్‌ ఆర్ముగం నేతృత్వంలోని రెవెన్యూ అధికారులు పోలీసు సాయంతో ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement