యువకుడి బలవన్మరణం | Sakshi
Sakshi News home page

యువకుడి బలవన్మరణం

Published Sun, Dec 3 2023 1:42 AM

-

అన్నానగర్‌: మద్యం తాగొద్దని భార్య గొడవ పడడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ధర్మపురి జిల్లాలో జరిగింది. బొమ్మిడి సమీపంలోని ఫైయర్‌ నత్తం కదిరిపురానికి చెందిన మణి కుమారుడు పుగలేంది (22) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 8 నెలల క్రితం మైలాడు సెక్టార్‌కు చెందిన ఆర్తిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. మద్యానికి బానిస కావడంతో పుగలేందిని తల్లి, భార్య నిలదేశావారు. మనస్తాపం చెందిన పుగలేంది శుక్రవారం రాత్రి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది చూసి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. తండ్రి మణి బొమ్మిడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ విఘ్నేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement