అన్నానగర్: హోసూరు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ప్రియురాలి భర్తను నరికి చంపిన యువకుడితో పాటు అతని బంధువును పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కృష్ణగిరి జిల్లా పేరిగై సమీపంలోని ముదుకురాకి గ్రామానికి చెందిన నారాయణప్ప. ఇతని కుమారుడు దుర్గేష్ (25) కూలీ. ఇతని భార్య సోనియా (22), పక్కింటికి చెందిన నటరాజ్ (30) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నటరాజ్, సోనియాకు మధ్య వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలుసుకున్న దుర్గేష్, భార్య సోనియా, నటరాజ్ తీరును ఖండించారు.
ఈ సందర్భంలో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న దుర్గేష్ని హత్య చెయ్యలాని నటరాజ్ పథకం చేశాడు. ఈమేరకు ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటలకు నటరాజ్, తన బాబాయి కొడుకు మధు(22)తో కలిసి దుర్గేష్ ఇంటి లోపలికి వెళ్లి అక్కడే నిద్రిస్తున్న అతనిని కొడలితో నరికి చంపాడు. దుర్గేష్ కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు పరుగులు తీశారు. కానీ అప్పటికి నటరాజ్, మధు అక్కడి నుండి పరారయ్యారు.
రక్తపుమడుగులో ఉన్న దుర్గేష్ని బంధువులు రక్షించి కృష్ణగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చేర్పించిన కొద్దిసేపటికే అతడు మృతి చెందాడు. రాజ్, మధును పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. అలాగే ఈ హత్యలో సోనియా హస్తం ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.