సేలం: భార్య నగ్న వీడియోను స్నేహితులకు పంపించిన వ్యవహారంలో పోలీసులు గాలిస్తున్న నవవరుడు కోర్టులో లొంగిపోయాడు. పోలీసుల కథనం మేరకు.. సేలం జిల్లా ఏర్కాడు సెందిట్టు సమీపంలో ఉన్న కల్లకాడు ప్రాంతానికి చెందిన సెంథిల్ (23)కు కారిపట్టికి చెందిన 23 ఏళ్ల యువతిని ప్రేమించి గత నెల 17వ తేదీ కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకున్నాడు. యువతి కోసం ఆమె కుటుంబసభ్యులు గాలిస్తున్నట్టు తెలిసి, యువతితో పాటు సెంథిల్ పోలీసు స్టేషన్కు వెళ్లి, పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసుల విచారణలో ఆమె సెంథిల్తోనే ఉంటానని తెలపడంతో పోలీసులు అతనితో పంపించారు. గత వారం ఆమె సెంథిల్కు తెలియకుండా ఏర్కాడులో ఉన్న పుట్టింటికి వచ్చింది. అప్పుడు తన నగ్న చిత్రాన్ని సెంథిల్ అతని స్నేహితులకు పంపించినట్టు తెలిపి, వాపోయింది. ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పరారైన సెంథిల్ కోసం గాలింపు చేపట్టారు. ఈ స్థితిలో వాళప్పాడి కోర్టులో సెంథిల్ లొంగిపోయాడు. అతన్ని 22వ తేదీ వరకు సేలం జైలుకు రిమాండ్కు తరలించారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో యువతితో ప్రేమలో ఉన్న రోజుల్లోనే ఆమె దుస్తులను బలవంతంగా తొలగించి, వీడియో కాల్ చేసినట్టుగాను, ఆ సమయంలో ఆమెకు తెలియకుండా ఆ దృశ్యాలను రికార్డ్ చేసిన సెంథిల్, పెళ్లి తర్వాత దాన్ని స్నేహితులకు పంపించినట్టు తెలిసింది. కాగా ఆ దృశ్యాలను చూపించే యువతిని బలవంతంగా సెంథిల్ పెళ్లి చేసుకుని ఉండవచ్చనే సందేహం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రెండు రోజులు సెంథిల్ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నట్టు తెలిపారు. కేసు విచారణ కొనసాగుతోంది.