హైదరాబాద్‌లో మరో విషాదం..నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడి మృతి | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మరో విషాదం..నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడి మృతి

Published Tue, May 2 2023 12:48 PM

6 Years Child Died After Falling Into Waterhole - Sakshi

హైదరాబాద్‌: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలో మరో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు.  నగరంలోని జూబ్లీహిల్స్‌లో గల రోడ్ నెం.45లో ప్రమాదవశాత్తు నీటిగుంతలో పడి  వివేక్‌ అనే ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు.  

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లోని కళాసిగూడలో మౌనిక అనే చిన్నారి నాలాలో పడి మృతిచెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకోవడంతో ఆందోళన రేకెత్తిప్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement