Amit Shah And JP Nadda Attends Maha Jan Sampark Abhiyan Meetings In Telangana - Sakshi
Sakshi News home page

త్వరలో తెలంగాణకు అమిత్‌షా, జేపీ నడ్డా

Published Thu, May 18 2023 10:57 AM

Amit Shah, JP Nadda Attends Maha Jan Sampark Abhiyan Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 30 నుంచి నెలరోజుల పాటు నిర్వహించనున్న ‘మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌’లో తెలంగాణలో నిర్వహించే రెండు బహిరంగ సభలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఉత్తర, దక్షిణ తెలంగాణలలో ఒక్కొక్క బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.

ఈనెల 23న దేశవ్యాప్తంగా పది లక్షల మందిపోలింగ్‌ బూత్‌ స్థాయి కార్యకర్తలతో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. మోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 396 బహిరంగ సభల్లో భాగంగా వీటిని నిర్వహిస్తున్నట్టు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తెలిపారు.

ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ జన్‌ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా వివిధ రంగాల్లో ప్రముఖులైన లక్ష మందితో ఇంటరాక్టివ్‌ సెషన్‌లు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ప్రతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి 250 మందిని ఎంపిక చేస్తున్నట్టు తెలియజేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement