సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని విభజన చేసుకుంటోంది. అందులో భాగంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు కీలక బాధ్యతలు అప్పజెప్పనుంది. ఇప్పటికే కొందరు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు పని బాధ్యతలు ఇవ్వగా, అందులో క్రియాశీలంగా లేని వారిని ఆ బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు మరికొందరికి కొత్తగా బాధ్యతలు ఇవ్వనుంది.
అనుబంధ సంఘాలను బలోపేతం చేయడంతో పాటు జిల్లాల్లో పార్టీ కేడర్ను కదిలించే కీలక బాధ్యతలు, కార్యాచరణ అప్పగిస్తామని, ఈ ఎనిమిది నెలల పాటు అవిశ్రాంతంగా పనిచేయడం ద్వారా రానున్న ఎన్నికల్లో అధికారం దక్కేలా కృషి చేయాలని పార్టీ నేతలను కోరింది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే శనివారం గాంధీ భవన్లో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో భేటీ అయ్యారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్జావెద్, రోహిత్చౌదరిలతో పాటు చామల కిరణ్రెడ్డి, నేరెళ్ల శారద, ఎం.ఎ.ఫయీమ్, గౌరీశంకర్, వినోద్కుమార్ తదితర నేతలు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు బాధ్యతల అప్పగింతపై చర్చించారు. పనిచేయలేని నేతలు స్వచ్ఛందంగా తప్పుకోవాలని, ఆ స్థానంలో ఇతరులకు బాధ్యతలివ్వాలని సమావేశంలో తీర్మానించారు. గత సమావేశాలకు రాని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు షోకాజ్నోటీసులివ్వాలని నిర్ణయించారు.
కాంగ్రెస్ వాదన బలంగా వినిపించాలి
రాష్ట్రంలోని బీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాదనను అటు ప్రసార మాధ్యమాల్లోనూ, ఇటు సోషల్మీడియాలోనూ బలంగా వినిపించాలని ఠాక్రే, రేవంత్రెడ్డిలు సూచించారు. ఈ మేరకు శనివారం గాంధీభవన్లో జరిగిన రాష్ట్ర సోషల్మీడియా సమావేశంలో దిశానిర్దేశం చేశారు.
పార్టీ చేపట్టిన కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై ఫోకస్ పెట్టాలని కోరారు. అనంతరం రిజర్వుడు నియోజకవర్గాల్లో లీడర్షిప్ మేనేజ్మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఎల్డీఎంఆర్సీ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో రిజర్వుడు నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే ప్రణాళికపై కాంగ్రెస్ ముఖ్య నేతలు చర్చించారు.
కాంగ్రెస్లో ‘పని విభజన’
Published Sun, Apr 9 2023 1:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement