గూగుల్‌ ప్రతినిధులతో సీపీ సజ్జనార్ సమావేశం.. | Sakshi
Sakshi News home page

గూగుల్‌ ప్రతినిధులతో సీపీ సజ్జనార్ సమావేశం..

Published Thu, Sep 24 2020 6:13 PM

CP Sajjanar Holds Meeting With Google Representatives - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సోషల్‌ మీడియా దిగ్గజం గూగుల్ ప్రతినిధులతో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సైబరాబాద్ సీపీ సజ్జనార్ గురువారం సమావేశమయ్యారు. గూగుల్‌లో కస్టమర్ కేర్ నెంబర్, గూగుల్ యాడ్స్ సర్వీసెస్, గూగుల్ వ్యూ ఫామ్‌ల ద్వారా అమాయక ప్రజలను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్ల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీపీ చర్చించారు. కాగా యూట్యూబ్‌లో అభ్యంతరకర వీడియోలను పోస్ట్ చేసే వారిపై దృష్టి సారించాలని తెలిపారు. వివిధ గూగుల్ ప్లాట్ ఫామ్‌లను ఉపయోగించి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నెరగాళ్లను కట్టడి చేయాలని పేర్కొన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి గూగుల్ టెక్నికల్ టీమ్‌ పోలీసులకు సహకరించాలని తెలిపారు. ఈ సమావేశంలో గూగుల్ ప్రతినిధులు గీతాంజలి దుగ్గల్, సునితా మొహంటీ, దీపక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement