సాక్షి, హైదరాబాద్: కరువులో అధికమాసం.. ఇది నానుడి. కరోనా కాలంలో అధిక ఆదాయం.. న్యూ‘నుడి’! ఒకవైపు కరోనా కలవరం, మరోవైపు సెలవులు.. అయినా రిజిస్ట్రేషన్ల శాఖకు కాసులపంట పడింది. ఆ శాఖ శ్రావణశోభను సంతరించుకుంది. ఆగస్టులో రిజిస్ట్రేషన్ల శాఖ లావాదేవీలు భారీగా పెరిగాయి. ఈ నెలలో 12 రోజుల ఆదాయం రూ.106 కోట్లు దాటింది. అయితే, సెలవులు పోను ఆరు రోజులు మాత్రమే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేశాయి. ఈ లెక్కన రోజువారీ ఆదాయం సగటున దాదాపు రూ.18 కోట్లకు చేరింది. ఆగస్టు ఒరవడిని బట్టి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు మళ్లీ పూర్వస్థితికి చేరినట్టేనని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
కొత్త వెంచర్లు మినహా..
రాష్ట్రంలోకి కరోనా ప్రవేశించడానికి ముందు రోజూ 5 వేల రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగేవి. సగటున రూ.20 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. లాక్డౌన్ కారణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మూతపడడంతో ఆదాయం స్తంభించిపోయింది. మే నెలలో తిరిగి ప్రారంభమైనా జూన్, జూలై మాసాల్లో ఆశించిన మేర లావాదేవీలు జరగలేదు. ప్రజల వద్ద నగదు లభ్యత లేకపోవడం, రుణాల మంజూరుకు ఆటంకాలు ఏర్పడడం, కరోనా వైరస్ భయంతో రిజిస్ట్రేషన్లకు జనం పెద్దగా ముందుకు రాలేదు. కానీ, జూలైలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడం, జూలైలో శ్రావణమాసం రావడంతో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు పెరిగాయని ఆ శాఖ అధికారులంటున్నారు.
లాక్డౌన్కు ఒకట్రెండు నెలలు ముందు కొత్తగా వేసిన వెంచర్లు మినహా అన్ని లావాదేవీల్లో పురోగతి కనిపిస్తోందని, లాక్డౌన్కు ముందు తరహాలోనే ఆగస్టులో కార్యకలాపాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఆదివారాలు, బక్రీద్, కృష్ణాష్టమి, రెండో శనివారం సెలవుదినాలు కాగా, రాఖీ పౌర్ణమి నాడు ఐచ్ఛిక సెలవు కారణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేయలేదు. దీంతో ఈ నెలలో కేవలం 6 రోజులు మాత్రమే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేశాయి. అయినా ఆదాయం రూ.106 కోట్లు దాటడం, రోజు సగటు లాక్డౌన్కు ముందు మాదిరిగా దాదాపు రూ.18 కోట్లకు చేరడం గమనార్హం. ఇక, ఈ ఏడాది గణాంకాలు పరిశీలిస్తే ఇప్పటివరకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం రూ. 1,111 కోట్లకు చేరింది. ఆగస్టులో రోజుకు 4 వేలకుపైగా రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగాయి. ఇదే ఊపు కొనసాగితే ఆగస్టు నెలలో ఆదాయం లాక్డౌన్కు ముందు ఉన్నట్టు రూ.500 కోట్లకు చేరుకునే అవకాశం ఉందనే భరోసా రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల్లో కనిపిస్తోంది.
6 రోజులు.. రూ.106 కోట్లు!
Published Thu, Aug 13 2020 5:40 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రుబెల్లాపై గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి
స్పైస్జెట్కు రూ.60 వేల జరిమానా
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పింఛన్ల పెంపు
నేడు ప్రధానమంత్రి రోడ్ షో
ఓటింగ్ శాతం పెంచాలి
ఉమ్మరకోట్ సొంతం!
సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడా తగ్గించాలి
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement