కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
జనగామ: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ బూత్లోకి అనుమతి విషయమై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతల కు దారి తీసింది. జిల్లా కేంద్రంలోని ధర్మకంచ బాలికల ఉన్నత పాఠశాల 263 బూత్లో పోలింగ్ పర్సంటేజీ పరిశీలించేందుకు కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి వెళ్లగా.. బీఆర్ఎస్ బూత్ ఏజెంట్ ప్రవీణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి తరఫున ఎలక్షన్ ఆథరైజ్డ్ పర్సన్గా వచ్చానని చెప్పే క్రమంలో మాటా మాటా పెరిగింది. బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి సమాచారం ఇవ్వగా ఆయన అక్కడికి చేరుకున్న సమయంలోనే ప్రశాంత్రెడ్డి బయటకు వస్తూ ఎదురుపడ్డారు. ఇరువురి మధ్య మాటల తూటాలు పేలాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారనుండగా.. అక్క డే ఉన్న ఏసీపీ అంకిత్కుమార్, సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు ఇరువురికి నచ్చజెప్పారు. రెండు వర్గాలను పంపించి పోలింగ్ స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం డీసీపీ సీతారాం చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.
గానుగుపహాడ్లో లాఠీచార్జ్
జనగామ మండలం గానుగుపహాడ్ గ్రామ కూడలి లో డమ్మీ ఈవీఎంలతో పాటు పార్టీల తరఫున ప్రచారం చేస్తున్న పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు చెరదగొట్టారు. టెంట్లు కూల్చి వేసి, లాఠీలతో కొట్టడంతో దుర్గామాత ఆలయ పూజారి రెడ్డబోయిన నర్సయ్యతో పాటు మరి కొందరు స్వల్పంగా గాయపడ్డారు. సీఐ వచ్చీ రావడంతోనే కొట్టారని బాధితులు గాయాలు చూపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటపై పలువురు ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. లాఠీ చార్జ్ ఘటనను ఎలక్షన్ కమిషన్ సుమొటోగా తీసుకుని కేసు నమో దు చేసి విచారణ చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షు డు ఆరుట్ల దశమంతరెడ్డి డిమాండ్ చేశారు. సీఐ రఘుపతిరెడ్డి మాట్లాడుతూ తాము ఎవరిపైనా లాఠీ చార్జ్ చేయలేదని, డమ్మీ ఈవీఎంలతో ప్రచా రం చేస్తుంటే వద్దని చెప్పడంతో దురుసుగా ప్రవర్తించారని, ఈ విషయమై బీజేపీ నాయకులు శానబోయిన మహిపాల్పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కాగా మద్దూరు మండలం బైరాన్పల్లి, చేర్యాల పట్టణంలో కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీల నాయకుల మధ్య చిన్న పాటి ఘర్షణ చోటుచేసుకుంది. అలాగే జనగామ మండలం పెంబర్తిలో కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి పోలింగ్ బూత్లోకి వెళ్లే క్రమంలో బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి,
ప్రశాంత్రెడ్డి మధ్య వాగ్వాదం
జనగామ ధర్మకంచలో ఉద్రిక్తత
గానుగుపహాడ్లో పోలీసుల లాఠీ చార్జ్
నిరసన వ్యక్తం చేసిన ఓటర్లు, నాయకులు