15 నుంచి ఒంటిపూట బడులు | Sakshi
Sakshi News home page

15 నుంచి ఒంటిపూట బడులు

Published Fri, Mar 8 2024 3:17 AM

Half day schools from March 15th - Sakshi

ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు

ఏప్రిల్‌ 23 చివరి పనిదినం 

ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఈ నెల 15 నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించాలని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ఎయిడెడ్, ప్రైవేటు యాజమా న్యాలన్నీ ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది.

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 12.30 గంటల నుంచి అమలు చేయాలని, పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందించిన తర్వాతే ఇంటికి పంపించాలని నిర్దే శించింది. పదోతరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుండ టంతో పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లను మధ్యా హ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు నిర్వహించాలని చెప్పింది.

2023–24 విద్యా సంవత్సరానికి ఏప్రిల్‌ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినంగా విద్యాశాఖ నిర్దేశించింది. దీంతో అప్పటివరకు ఒంటిపూట బడులే నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈ సమాచారాన్ని పంపాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement