ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): కరోనాతో ఉపాధి లేక ఓ వ్యక్తి ఆకలితో మృతి చెందిన సంఘటన పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ గ్రామానికి చెందిన బద్దారం కిష్టయ్య(40) గత కొద్ది సంవత్సరాలుగా పట్టణంలోని ఓ హోటల్లో పని చేస్తు జీవిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా వ్యాపిస్తుండడంతో హోటల్ నిర్వహణ సరిగా లేక పోవడంతో దొరికిన చోట పని చేస్తు జీవిస్తున్నాడు. పట్టణంలో ఇటీవల వైరస్ ఉధృతి పెరగడంతో గత నెల 24 నుంచి 31 వరకు పూర్తిగా లాక్డౌన్ ఉండడంతో ఎక్కడ పని దొరకక, హోటల్ నడవక పోవడంతో ఆకలిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ప్రతి రోజు ప్రభుత్వ ఆస్పత్రి పాత భవనం వద్ద పడుకునే వాడని స్థానికులు తెలిపారు. ఆదివారం ఉదయం వరకు కిష్టయ్య నిద్ర లేవక పోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు మృతుడి అన్నదమ్ములకు సమాచారం అందించడంతో వారు వచ్చి కిష్టయ్య మృత దేహాన్ని తీసుకుని వెళ్లారు. అన్నాసాగర్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఉపాధి లేక ఆకలి చావు
Published Mon, Aug 3 2020 1:10 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
Advertisement