Telangana: Cm Kcr Fires On Narendra Modi Press Meet Full Details Here - Sakshi
Sakshi News home page

అమెరికాలో ఇండియా పరువు తీశారు

Published Mon, Feb 14 2022 4:15 AM

Hyderabad: Cm Kcr Fires On Narendra Modi Press Meet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమెరికా ఎన్నికలతో మన దేశానికి ఏం సంబంధం? అవేమైనా అహ్మదాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలా? ఎవరైనా బాధ్యతగల ప్రధాని ఇతర దేశాల ఎన్నికల్లో ప్రచారం చేస్తారా? అది కూడా అమెరికా లాంటి దేశంలో.. మన దేశానికి ఎంత నష్టం జరుగుతుంది. అమెరికా వెళ్లి ‘అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌’ అని మోదీ ప్రచారం చేశారు. ఇది పూర్తిగా వ్యూహాత్మక తప్పిదం. ఎన్నికల తర్వాత అక్కడ ప్రభుత్వం పల్టీ కొట్టింది. ఇటీవల మోదీ అమెరికా వెళ్తే వైట్‌హౌజ్‌లో పలకరించే వాడు లేడు. ఎయిర్‌పోర్టులో గౌరవమైన స్వాగతం లేదు. దేశం పరువు పోయింది. 

కిషన్‌రెడ్డికి ఏం అర్థమైందో.. నాకు అర్థంకాలే.. 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గరీబ్‌గాడు. ఏం మాట్లాడుతడో తెలియదు. చదువు వస్తదో రాదో.. వేరేవాళ్లతో మాట్లాడిస్తే మంచిది. లేదంటే పరువు పోతది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నాకు మిత్రుడే. కానీ నాకు కేంద్ర బడ్జెట్‌ అర్థంకాలేదని అంటున్నడు. నాకేం అర్థంకాలేదో.. ఆయనకేం అర్థమైందో.. నాకు అర్థంకావట్లేదు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement