Jhamunda: అమ్మాయిలను టార్గెట్‌ చేసుకుని.. | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ఝాముండ: ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిల వీడియోలతో ఆగడాలు

Published Thu, Oct 13 2022 12:09 PM

Jhamunda Instagram Targets And Harassed Hyderabadi Girls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో కొత్త తరహా ఆగడాలు వెలుగు చూశాయి. యువతులను లక్ష్యంగా చేసుకుని చేసుకుని.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఝాముండ అఫీషియల్ పేరుతో ఓ ముఠా పేట్రేగిపోతోంది. ఫిర్యాదులు అందడంతో..  పేజ్‌ నిర్వాహకుల పూర్తి డేటా ఇవ్వాలని ఇన్‌స్టాగ్రామ్‌కు పోలీసులు లేఖ రాశారు. 

ఓ వర్గానికి చెందిన వాళ్లను టార్గెట్‌ చేస్తూ.. వీడియోలు చిత్రీకరిస్తోంది ఝూముండ అఫీషియల్ పేజీ. వీడియోలు పోస్ట్‌ చేసి ఓ వర్గం యువతులను టార్గెట్‌ చేస్తోంది ఆ ముఠా. పైగా తమ కమ్యూనిటీని డ్యామేజ్‌ చేస్తున్నారంటూ మహిళకు ట్యాగ్‌ లైన్‌తో పోస్టులు చేస్తున్నారు. 

రోజు రోజుకు ఝాముండ పేజ్‌ ఆగడాలు పేట్రేగిపోతుండడంతో.. బాధితుల ఫిర్యాదు మేరకు పేజ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.

Advertisement
Advertisement