5 Ayyappa Devotees Died In Tractor And Truck Accident In Suryapet, Details Inside - Sakshi
Sakshi News home page

సూర్యాపేటలో విషాదం.. అయ్యప్ప పడిపూజకు వెళ్లి వస్తుండగా ప్రమాదం

Published Sun, Nov 13 2022 8:12 AM

Lorry Collied With Tractor At Suryapet District - Sakshi

సాక్షి, సూర్యాపేట: జిల్లాలోని మునగాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 

వివరాల ప్రకారం.. అయ్యప్పస్వాములు పడిపూజకు వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో 33 మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం. కాగా, దారుణ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.  


 

Advertisement
Advertisement