Video: కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడిన ప్రయాణికుడు
Published
Tue, Jan 30 2024 1:46 PM
సాక్షి, వికారాబాద్: కదులుతున్న రైలు ఎక్కబోయి ఓ ప్రయాణికుడు రైల్వే ట్రాక్ మధ్యలో ఇరుక్కుపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది.. ట్రాక్ మధ్యలో చిక్కుకున్న వ్యక్తిని సురక్షితంగా బయటకు లాగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వికారాబాద్ రైల్వే స్టేషన్లో వెలుగుచూసింది.
బీదర్ నుంచి యశ్వంతపూర్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు వికారాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలు దేరింది. స్టేషన్ నుంచి ఓ ప్రయాణికుడు హుటాహుటినా పరుగెత్తుకొచ్చి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాలుజారి ప్రమాదవశాత్తు రైలుకు, ట్రాక్కు మధ్య ఇరుక్కుపోయాడు. విషయం గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును ఆపారు.
రైల్వే సిబ్బంది, పోలీసులు రెండు గంటలు శ్రమించి రైల్వే ట్రాక్ మధ్యలో ఇరుక్కున్న వ్యక్తిని కాపాడారు. ప్లాట్ఫాం పగులగొట్టి ప్రయాణికుడిని అతడిని బయటకు తీశారు. అతడికి స్వల్ప గాయాలవ్వగా.. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. గాయపడిన వ్యక్తిని రాయచూర్కు చెందిన సతీష్గా గుర్తించారు.
A man slipped and got stuck between the train and platform, while attempting to board a moving train at #Vikarabad Railway Station and was dragged along, recorded in #CCTV .