సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు విచార ణకు హాజరవుతున్న నేపథ్యంలో ఆమె సోదరుడు, మంత్రి కేటీఆర్ శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. శని, ఆదివారాలు ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం. లిక్కర్ స్కామ్లో వంద కోట్ల ముడుపుల ఆరోపణలపై కవిత, అరుణ్ రామచంద్ర పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబులను ఏకకాలంలో విచారించ వచ్చనే ప్రచారం జరుగుతోంది.
ఈ ముగ్గురు సౌత్ గ్రూపులో కీలక భూమిక పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల విచారణ తరువాత కవితను అరెస్టు చేయవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కవితకు నైతిక మద్దతుగా నిలిచేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విష యమై న్యాయ నిపుణులతోనూ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. కవితకు న్యాయవాదులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు.