సాక్షి, హైదరాబాద్: మైనార్టీల సంక్షేమంలో భాగంగా ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. మొదటి దశలో భాగంగా ఎంపిక చేసిన 10 వేల మంది లబ్దిదారులకు ఈ నెల 16 నుంచి రూ.లక్ష చెక్కుల పంపిణీ ప్రారంభించాలన్నారు. ఈ పథకానికి ఇప్పటికే రూ. 270 కోట్లు కేటాయించగా, ఇప్పుడు మరో రూ.130 కోట్లు కేటాయించామని, దీంతో మొత్తం రూ. 400 కోట్లకు చేరిందన్నారు.
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మైనార్టీల సమస్యలపై చర్చించేందుకు సచివాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, గంగుల, తలసాని, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, మైనారిటీ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్ పాల్గొన్నారు. మైనారిటీలకు రూ.లక్ష సాయం, ఓవ ర్సీస్ స్కాలర్షిప్స్, శ్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్, మౌజం సంఖ్య పెంపు, క్రిస్టియన్ శ్మశాన వాటికలు, ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ తదితర అంశాలపై చర్చించారు.
అన్ని వర్గాల అభివృద్ధికి....
రాష్ట్రంలో మైనారిటీలతోపాటు అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుందని హరీశ్రావు చెప్పారు. శ్మశానవాటికలకు 125 ఎకరాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్లు–మౌజంల సంఖ్య పెంపుపై ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో జనాభా దామాషా ప్రకారం లబ్దిదారుల ఎంపిక సాగాలని, మైనారిటీల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
శ్మశానవాటికలు, ఈద్గాల భూముల కోసం వచ్చిన వినతులను క్రోడీకరించాలని, ఈ దిశగా పనులు వేగవంతం చేయాలని చెప్పారు. ఒవైసీ పహాడీ షరీఫ్ దర్గా ర్యాంప్ పనులు, దర్గా బర్హనా షా అద్దెల సవరణ, క్రిస్టియన్ శ్మశానవాటికలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఇతర పనులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలన్నారు.
16 నుంచి మైనారిటీలకు రూ.లక్ష సాయం
Published Wed, Aug 9 2023 5:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement