Sakshi News home page

ఘట్‌కేసర్‌ శ్రీనిధి కాలేజీలో ఉద్రిక్తత.. ఫర్నిచర్‌, అద్ధాలు ధ్వంసం

Published Wed, Aug 16 2023 3:22 PM

Students Protest At Ghatkesar Srinidhi College - Sakshi

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: ఘట్‌కేసర్‌ శ్రీనిధి ఇంజినీరింగ్‌ కాలేజీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాలేజీ ఫర్నిచర్‌, అద్ధాలను విద్యార్థులు ధ్వంసం చేశారు. వర్శిటీ గుర్తింపు వస్తుందంటూ వసూలు చేసిన డబ్బు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ స్టూడెంట్‌ కాలేజీ బిల్డింగ్‌ పైకి ఎక్కడంతో కలకలం రేగింది. తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులు, తల్లిదండ్రులను పోలీసులు అడ్డుకున్నారు.
చదవండి: కేసీఆర్‌ మెదక్‌ పర్యటన వాయిదా.. కారణం ఇదే..

Advertisement
Advertisement