అసెంబ్లీలో కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్‌ | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. అప్‌డేట్స్‌

Published Thu, Feb 15 2024 9:04 AM

Telangana Assembly Budget Sessions Day 6 Live Updates - Sakshi

Updates..

రేపటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

  • అసెంబ్లీలో కుల గణన తీర్మానం రేపటికి వాయిదా
  • ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని భావించిన సర్కార్
  • ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ఆలస్యం అవడంతో రేపు సభలో కులగణన తీర్మానం
  • రేపు ఉదయం 10 గంటలకు సభలో తీర్మానం పెట్టనున్న మంత్రి పొన్నం
  • ఆ తర్వాత నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం పెట్టనున్న ప్రభుత్వం.

ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క... అసెంబ్లీలో బడ్జెట్‌పై రిప్లై

  • రాష్ట్రంలో ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌లేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గ‌త ప్ర‌భుత్వం
  • జీఎస్‌డీపీకి అనుగుణంగానే 60వేల కోట్ల రూపాయ‌లు బ‌డ్జెట్‌లో చూపించాము
  • రాష్ట్రం తెచ్చుకున్న‌దే ఉద్యోగాల కోసం
  • 10 సంవ‌త్స‌రాలు అధికారంలో ఉండి గ్రూప్ -1 వేయ‌లేక‌పోయారు. ఎంత మంది త‌ల్లులు క‌న్నీళ్లు పెట్టుకున్నారో మీకు తెలియ‌దు
  • టీఎస్‌పీఎస్సీ ప్ర‌క్షాళ‌న చేశాం. ఉద్యోగాల నోటిఫికేష‌న్ కోసం 40 కోట్ల రూపాయ‌లు ఇచ్చాము. 563 గ్రూప్-1 ఉద్యోగాల కోసం నోటిఫికేష‌న్ వేయ‌బోతున్నాము.
  • ఎల్ బి స్టేడీయంలో 7వేల మంది స్టాఫ్ న‌ర్సుల‌కు నియామ‌క ప‌త్రాలు ఇచ్చాము
  • సింగ‌రేణిలో 441 మందికి అంబేద్క‌ర్ విగ్రహం సాక్షిగా నియామ‌క ప‌త్రాలు ఇచ్చాము
  • రాష్ట్రంలో ఉద్యోగాల జాత‌ర మొద‌లు పెట్టాము. ఇది ఆరంభం మాత్ర‌మే
  • 13444 మందికి కానిస్టేబుల్స్‌కు నియామ‌క ప‌త్రాలు ఎల్ బి స్టేడియంలో ఇచ్చాము
  • ఆరు గ్యారంటీల హామీల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాము. గాలికి వ‌దిలేయ‌లేదు

  • వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ రూపాకల్పన చేసాము
  • గత ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితికి బడ్జెట్ తీసుకువచ్చింది
  • ఆరు గ్యారెంటిలకు 53వేలు కేటాయించాము.. ఇందులో తప్పేముంది
  • ప్రతీ సెగ్మెంట్ కు ఇందిరమ్మ 3వేల కు పైగా కట్టిస్తాము
  • మహాలక్ష్మీ పథకం దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది.

  • గతంలో ఆదాయం లేకున్నా 20 శాతం పెంచుకుంటూపోయారు
  • పెట్టిన లెక్కలు ఖర్చు అయ్యాయా లేదా అన్నది గత 10 ఏళ్లు పట్టించు కోలేదు
  • 2014 నుంచి 2023 వ‌ర‌కు 14,87,834 కోట్లు ప్ర‌వేశ పెట్ట‌గా ఖ‌ర్చు చేసింది 12,25,326 కోట్లు మాత్ర‌మే- 2,62,518 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌లేదు
  • 2023-24 వార్షిక సంవ‌త్స‌రం లో కూడ బ‌డ్జెట్‌లో 70 వేల రూపాయ‌ల వ్య‌త్యాసం ఉంది
  • బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించి రాబ‌డి రాకుండ ఎత్తి వేయడం వ‌ల్ల పేద‌లు, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల కొర‌కు కేటాయించిన సంక్షేమ ప‌థ‌కాల‌కు కోత ప‌డుతుంది
  • ఆదాయం బాగున్న తెలంగాణ రాష్ట్రం బ‌డ్జెట్ లో పెట్టిన ఖ‌ర్చు 79 శాతం మాత్ర‌మే ఉండ‌టం దుర‌ద్రుష్ట‌క‌రం

శాసన మండలి ప్రాంగణంలో.. ఎమ్మెల్సీ కవిత 

  • రాష్ట్ర ప్రభుత్వం  నిన్న సెక్రటేరియట్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహానికి భూమి పూజ చేశారు
  • గత ప్రభుత్వం అక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిచేలా తెలంగాణ తల్లి  విగ్రహాన్ని పెట్టాలి అనుకున్నం
  • నిన్న సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేసి అధికారికంగా రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు చేస్తామని చెప్పారు
  • తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయడంలో మాకు అభ్యతరం లేదు
  • ఎందుకంటే అమ్మ పేదగా ఉన్న గొప్పగా ఉన్న అమ్మనే
  • అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాని వ్యతిరేకిస్తున్నాం


ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్

  • మాకు రాజీవ్‌గాంధీ  పట్ల మాకు గౌరవం ఉంది
  • దేశం కోసం అయినా చేసిన సేవలు పట్ల గౌరవం ఉంది 
  • జాతీయ నాయకుల పేర్లు అనేక వాటికి పెట్టుకున్నాం
  • ఇప్పటికే ఎయిర్‌పోర్టు పెట్టుకున్నాం.. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహన్నీ పెట్టాల్సిన చోట ఈ విగ్రహం పెట్టటం సరైనది కాదు

తెలంగాణలో ఇసుక తవ్వకాలపై కాగ్ అక్షింతలు

  • పేరుకే గిరిజన సంఘాలకు ఇసుక తవ్వకాల కాంట్రాక్టు ఇచ్చారు
  • కానీ, నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు కాంట్రాక్టులు బదలాయించారు
  • ప్రభుత్వం ఇసుక అక్రమాలను అడ్డుకోలేకపోయింది
  • ఇసుక తవ్వకాల ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవు
  • అధిక లోడ్‌లు వేసి ప్రజాధనానికి నష్టం చేశారు
  • ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్‌ లేదు
  • అనుమతులు లేకుండా అధిక ఇసుక తవ్వకం, అక్రమ రవాణా జరిగింది
  • పర్యావరణ రక్షణ కోసం ఎలాంటి చర్యలు లేవు.

అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్‌ను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం..

  • కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్
  • అస్తవ్యస్తంగా.. పనులు ప్రారంభించారు 
  • మహారాష్ట్రలో ముంపు సమస్య ఎత్తిచూపిన కాగ్ 
  • డీపీఆర్‌లో 63,352 కోట్లు  చూపించి.. 1,06,000 కోట్లకు అంచనా వ్యయం పెంచారు.
  • ప్రస్తుత నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉంది.
  • మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు 1,47,427 కోట్లు ఖర్చు అవుతుంది.
  • ప్రాజెక్టు నుంచి ఊహించిన ప్రయోజనాలను ఎక్కువ చూపెట్టారు.
  • ప్రాజెక్టు వార్షిక ఖర్చులు తక్కువ చూపించారు.
  • కాళేశ్వరం నీటి అమ్మకం ద్వారా రూ.1,019కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు.
  • ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు తీసుకున్నారు.

  • 15 బ్యాంకులతో 87వేల కోట్లు సమకూర్చుకోవాలని ఒప్పందం చేసుకున్నారు.
  • బడ్జెటేతర రుణాలపై ప్రభుత్వం ఎక్కువ ఆధారపడి ఉంది.
  • రుణాలు చెల్లించడంలో కాలయాపన చేసింది.
  • ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రతీ సంవత్సరం 700 కోట్ల నుంచి 14వేల ఐదు వందల కోట్ల వరకు ఖర్చు అవుతుంది.
  • రుణాలు కట్టడం కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి.
  • కాళేశ్వరం అప్పు కట్టుకుంటూ పోతే 2036లో పూర్తవుతుంది.
  • ప్రాజెక్టు వ్యయం 122 శాతం పెరిగింది కానీ. ఆయకట్టు 52 శాతం మాత్రమే పెరిగింది 
  • కాళేశ్వరం ప్రాజెక్టు  వడ్డితో సహా 1,47,427 కోట్లకు పెరిగింది.. 
  • ప్రాణహిత ప్రాజెక్టు డీపీఆర్‌ లేదు 
  • ప్రాజెక్టు పనుల్లో మార్పుల కారణంగా కొన్ని పనులు నిరార్థకం అయ్యాయి.. ఫలితంగా 767 కోట్లు నష్టం 
  • కాళేశ్వరం డీపీఆర్‌ తయారు చేసిన వ్యాప్కోస్ పని తీరులో లోపాలు ఉన్నాయి 
  • రీఇంజనీరింగ్ పనులు కూడా అదే సంస్థకు అప్పగించారు 

అసెంబ్లీలో ముగిసిన జీరో అవర్..
►జీవో 317పై ఎమ్మెల్యే పాల్వయి హరీష్ బాబు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్.


►మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్లు వేయనున్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు.

►అసెంబ్లీ సెక్రటరీ వద్ద నామినేషన్ దాఖలు చేయనున్న అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్

►గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర

పంచాయతీరాజ్‌ శాఖపై కాగ్‌ రిపోర్ట్‌..

  • కాగ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు 
  • గత ప్రభుత్వ హయాంలో గ్రాంట్స్‌ మళ్ళింపు జరిగింది.
  • నిధుల దుర్వినియోగం జరిగింది.
  • బకాయిలు వసూలు చేయలేకపోయారు.
  • కొన్ని పనులకు అధిక బిల్లులు చెల్లించారు.
  • సకాలంలో రికార్డులు సమర్పించలేదు.

బీఆర్‌ఎస్‌ కోసం నా వంతు కృషి చేస్తా: వద్దిరాజు

  • రాజ్యసభ బీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవి చంద్ర కీలక వ్యాఖ్యలు
  • మరోసారి కేసీఆర్ నాకు అవకాశం ఇవ్వటం ఆనందంగా ఉంది
  • బీసీ బిడ్డనైన నాకు అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు
  • కృష్ణాజలాల వాటా కోసం రాజ్యసభలో నా గళం విప్పుతాను
  • కెసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు నా వంతు కృషి చేస్తాను.
  • అలవి గాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీలు నెరవేర్చే వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాను. 

జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

  • ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాలు పెడుతున్నారు.
  • ప్రజలచేత ఎన్నికైతేనే మేము ఎమ్మెల్యేలమయ్యాము. 
  • సమావేశాలకు మమ్మల్ని కూడా పిలవాలి అని కోరుతున్నాం.
  • జీహెచ్‌ఎంసీలో నిధుల కొరత ఉంది.
  • కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు.

అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్

  • అసెంబ్లీ ఇన్సైడ్ చైర్ అనుమతి లేకుండా మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, వీడియో ప్రదర్శన చేయొద్దు
  • అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద సభ్యులు మాట్లాడవద్దు 
  • బ్రేక్ టైం లేదా సభ వాయిదా తరువాతే సభ్యులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడాలి
  • నిన్న ఈ అంశంపైనే బీఆర్‌ఎస్‌ ఆందోళన
  • మీడియా పాయింట్‌ వద్దకు అనుమతించకపోవడంతో.. అసెంబ్లీలో రోడ్డుపైనే బైఠాయించి నిరసన

  • బీజేపీఎల్‌ ఫ్లోర్ లీడర్ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ని ప్రకటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్


► తెలంగాణ శాసన సభలో ప్రారంభమైన జీరో అవర్

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

  • అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ఆరో రోజు ప్రారంభం
  • సభను ప్రారంభించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌
  • ఇవాళ బడ్జెట్‌పై సమాధానం ఇవ్వనున్న ఆర్థిక మంత్రి భట్టి

► నేడు(ఆరో రోజు) తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. 

► నేడు అసెంబ్లీలో బడ్జెట్‌పై సమాధానం ఇవ్వనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

► ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలుపనున్న సభ

► ఉభయ సభల్లో కాగ్ నివేదికను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

► కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్‌ను సభలో పెట్టనున్న ప్రభుత్వం

► ఇరిగేషన్, రెవిన్యూ, ఫైనాన్స్, పంచాయితీరాజ్ రిపోర్ట్‌లను టేబుల్ చేయనున్న ప్రభుత్వం

► అసెంబ్లీలో పలు ప్రకటనలు చేయనున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం. 

మరోవైపు.. 
► నేటితో రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌ గడువు ముగియనుంది. 

► తెలంగాణలో నేడు నామినేషన్‌ వేయనున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు. కాంగ్రెస్‌ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నామినేషన్‌ వేయనున్నారు. 

► అటు బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. 

► నేడు అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను సమర్పించనున్నారు. 

Advertisement
Advertisement