Telangana Govt Filed Lunch Motion Petition on High Court MLA Poaching Case Verdict - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల ఎర కేసు తీర్పుపై లంచ్‌ మోషన్‌ పిటిషన్‌

Published Tue, Feb 7 2023 12:08 PM

Telangana  Govt Lunch Motion Petition on MLA  MLAs poaching case Case Verdict. - Sakshi

హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌లో మంగళవారం విచారణ జరిగింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదైందా అని కోర్టు ప్రశ్నించగా..ఇంకా నమోదు కాలేదని డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కేసు బదిలీకి మూడు సార్లు లేఖ రాసినా ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు.

సీబీఐ కేసు నమోదు చేయాలని, కేసు ఫైళ్లు అప్పగించాలని సీబీఐ ఒత్తిడి చేస్తోందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు పిటిషన్‌ విచారణకు చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ నుంచి అనుమతి తీసుకొని రావాలని జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి అడ్వకేట్‌ జనరల్‌కు సూచించారు. దీంతో రేపు ఉదయం సీజే బెంచ్‌లో మెన్షన్‌ చేస్తామని ఏజీ తెలిపారు. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఎన్నిరోజులు పడుతుందని సింగిల్‌ బెంచ్‌ ప్రశ్నించగా.. వారం పడుతుందని అడ్వకేట్‌ జనరల్‌ పేర్కొన్నారు. తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. 

కాగా ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ సీబీఐ విచారణకు అప్పగించాలని ఇచ‍్చిన తీర్పుపై.. తెలంగాణ ప్రభుత్వం. లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  నిన్న(సోమవారం) డివిజన్‌ బెంచ్‌ తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్‌ వేసింది.

రోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉన్నత న్యాయస్థానంలో తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురైంది. సీబీఐ విచారణకే మొగ్గు చూపిస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సమయం కోరగా.. అందుకు కూడా హైకోర్టు నిరాకరించింది.  ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ సర్కార్‌ను.. సింగిల్ బెంచ్ తీర్పు అమలు చేయాలనీ దర్యాప్తు సంస్థ సీబీఐని ఆదేశించింది హైకోర్టు డివిజన్‌ బెంచ్‌. 

మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం జరిగినట్లు అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేసి.. ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్‌ చేసింది. ఆపై సిట్‌ ద్వారా ఈ కేసు దర్యాప్తును కొనసాగించింది ప్రభుత్వం. అయితే.. కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించగా.. సీబీఐకి ఇవ్వొద్దంటూ తెలంగాణ సర్కార్‌ హైకోర్టును ఆశ్రయించింది. అయినప్పటికీ సర్కార్‌ అభ్యర్థనను డివిజన్‌ బెంచ్‌  తోసిపుచ్చింది దాంతో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది తెలంగాణ సర్కార్‌.

Advertisement
Advertisement