సాక్షి, హైదరాబాద్: ‘ఓడ ఎక్కేదాక ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడి మల్లన్న’సామెత చందంగా కేంద్రం లోని మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని మంత్రి హరీశ్రావు విమర్శించారు. ‘ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతాయని ముందు నుంచే ప్రజలను అప్రమత్తం చేశాం.
ఎన్నికలయ్యాక అదేవిధంగా ధరలు పెంచిన బీజేపీ ప్రభుత్వం తన మోసపూరిత వైఖరిని మరోసారి చాటుకుంది’అని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 7న ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన ‘యూపీ ఎన్నికల తర్వాత మళ్లీ బాదుడే’అని హరీశ్రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త క్లిప్పింగ్ను తన ట్వీట్కు జత చేశారు.