Sakshi News home page

Telangana: ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల

Published Fri, Oct 21 2022 6:51 PM

Telangana Police Constable And SI Preliminary Exam Results Out - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. సివిల్‌ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో 46.80 శాతం, సివిల్‌ కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షలో 31.40శాతం, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్‌ పరీక్షలో 44.84శాతం, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పరీక్షలో 43.65శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొంది. 

కాగా  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 554 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి  ఆగస్టు 7న రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 15,644 కానిస్టేబుల్, 63 ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్‌, 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోస్టులకు ఆగస్టు 28న పోలీసు నియామక మండలి పరీక్ష నిర్వహించింది. 

Advertisement
Advertisement