కొత్తగా 207 కేసులు | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 207 కేసులు

Published Sat, Dec 11 2021 3:17 AM

Telangana Reports 207 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 38,467 మందికి కరోనా టెస్టులు చేయగా 207 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసులు 6,77,954కి పెరిగా యి. ఒక రోజులో ఒకరు చనిపోగా ఇప్పటివరకు కరోనా మరణాలు 4,004కు చేరినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. తాజాగా 196 మంది కోలుకున్నారు.

దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 6,70,053కి పెరిగింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉన్న రిస్క్‌ దేశాల నుంచి శుక్రవారం 668 మంది హైదరాబాద్‌ విమానాశ్రయంలో దిగారు. వీరిలో ఇద్దరికి  పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ అవునో కాదో తెలుసుకునేందుకు వీళ్ల శాంపిళ్లను జినోమ్‌ సీక్వెన్సింగ్‌కు అధికారులు పంపారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement