TRS Workers Attack On BJP MP Arvind Residence In Hyderabad, Details Inside - Sakshi
Sakshi News home page

ఎంపీ అరవింద్‌ నివాసం వద్ద హైటెన్షన్‌.. ఇంటి అద్ధాలు, ఫర్నీచర్‌ ధ్వంసం

Published Fri, Nov 18 2022 12:06 PM

TRS Workers Protests At BJP MP Arvind Residence In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పొలిటికల్‌ వార్‌ మరోసారి హీటెక్కింది. నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అరవింద్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు హంగామా చేశారు.

హైదరాబాద్‌లోని అరవింద్‌ ఇంటిని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ముట్టడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే అరవింద్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం, వారందరూ అరవింద్‌ ఇంట్లోకి దూసుకెళ్లి అద్దాలు, ఫర్నీచర్‌, ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. దీంతో, పోలీసులు టీఆర్‌ఎస్ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. కాగా, ఎంపీ అరవింద్‌ ఇంట్లో లేని సమయంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడి చేశారు. 


 

Advertisement
Advertisement