సాక్షి, హైదరాబాద్: రాజకీయ, ప్రభుత్వ వర్గాల్లో కొన్ని గంటల పాటు ఉత్కంఠ రేపిన ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు కథ సుఖాంతమైంది. ఆదివారం ఉభయసభలు బిల్లును ఆమోదించాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు గవర్నర్ నుంచి ఈ బిల్లుకు గ్రీన్సిగ్నల్ రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది. కొన్ని అంశాలపై సూచనలు చేస్తూ.. గవర్నర్ ముసాయిదా బిల్లును సభలో ప్రవేశ పెట్టడానికి గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఉభయ సభల్లోనూ బిల్లును ప్రవేశపెట్టగా సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి.
దీంతో పాటు బాన్సువాడ మున్సిపాలిటీ నుంచి కోయగుట్ట తండా వార్డును, ఆలేరు మున్సిపాలిటీలోని సాయిగూడెం వార్డును తొలగించి విడిగా గ్రామపంచాయతీలుగా చేస్తూ రెండు బిల్లులకు కూడా సభలు ఆమోదం తెలిపాయి. దీనికి సంబంధించిన బిల్లులను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పీఆర్ శాఖ మంత్రి ఎర్రబెల్లి తరఫున శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సభ ముందు పెట్టారు. ఆర్టీసీ బిల్లుతో పాటు ఈ రెండు బిల్లులకు ఆమోదం తెలుపుతున్నట్టు శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలిలో చైర్మన్ గుత్తాసుఖేందర్రెడ్డి ప్రకటించారు.
ఆస్తులు యధాతథంగా కార్పొరేషన్లోనే ఉంటాయి : మంత్రి అజయ్
సంస్థ ఆస్తులు యధాతథంగా ఆర్టీసీ కార్పొరేషన్లోనే ఉంటాయని మంత్రి అజయ్ స్పష్టంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంలో భాగంగా వారితో ముడిపడిన వివిధ అంశాలకు సంబంధించి త్వరలోనే నియమ, నిబంధనలను రూపొందిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పూర్తి పీఆర్సి వర్తిస్తుందని, టీఎస్ఆర్టీ కార్పొరేషన్ అనేది కొనసాగుతున్నందున ఆస్తులు, అప్పులు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు కార్పొరేషన్ చెలిస్తుందని, సీసీఎస్ బకాయిలు వంటివి దాని పరిధిలోకే వస్తాయని చెప్పారు. జీతభత్యాల వరకే ప్రభుత్వం చూస్తుందన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలోనూ బిల్లు పాసయ్యాక వీలైనంత తొందరలో మార్గదర్శకాలను రూపొందిస్తామన్నారు. ఆయా అంశాలపై ఉద్యోగులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.
43,055 మంది పర్మినెంట్ ఎంప్లాయిస్..
ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం 43,055 మంది పర్మినెంట్ ఎంప్లాయిస్కు సంబంధించినదని, 240 మంది కాంట్రాక్ట్ డెయిలీవేజ్ కార్మికులు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్.. కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా విధులో కొనసాగుతారని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఐతే ఉద్యోగులకు భద్రత, సీసీఎస్ బకాయిలు, టీఏ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్,డెయిలీవేజ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో స్పష్టత నివ్వాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోరారు. వాటిపై స్పందిస్తూ మంత్రి అజయ్ వివరణనిచ్చారు. ఈ బిల్లుకు ఎంఐఎం సభ్యుడు మౌజంఖాన్ మద్దతు తెలిపారు.
ఆర్టీసీ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
Published Mon, Aug 7 2023 4:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement