పిచ్చాటూరు: ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులో నిందితులుగా ఉన్న నలుగురికి సత్యవేడు కోర్టు 15 రోజులు రిమాండ్ విధించినట్లు నాగలాపురం ఎస్ఐ హనుమంతప్ప తెలిపారు. గురువారం ఉదయం నాగలాపురం పోలీస్ స్టేషన్లో పుత్తూరు డీఎస్పీ రామరాజు, సత్యవేడు సీఐ శివకుమార్ రెడ్డి సమక్షంలో నలుగురు నిందితులతో పాటు వారు దొంగిలించిన 11 ద్విచక్ర వాహనాలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎ.అజయ్(28), వినోద్కుమార్(20), బి.విష్ణు(19), ప్రతాప్(32) నాగలాపురం తూర్పు ఆర్చి వద్ద బైక్పై నాగలాపురం వైపు వస్తుండగా అక్కడ ఉన్న పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారన్నారు. నలుగురుని ఎస్ఐ, సిబ్బంది చాకచక్యంగా పట్టుకుని విచారించారు. నాగలాపురం మండలంలో 5, పిచ్చాటూరు మండలంలో 4, శ్రీసిటీ, విజయపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 11 వాహనాలు దొంగిలించినట్లు అంగీకరించారని తెలిపారు. వాటి విలువ రూ.4.5 లక్షలు ఉంటుందన్నారు. నిందితుల్లో అజయ్, వినోద్కుమార్ విష్ణు నాగలాపురం మండలానికి చెందిన వారు కాగా, ప్రతాప్ తమిళనాడులోని పొన్నేరికి చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. వాహనాలను స్వాధీనం చేసుకొని నిందితులను సత్యవేడు కోర్టుకు తరలించగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కేసును ఛేదించడానికి కృషి చేసిన ఎస్ఐ హనుమంతప్ప, ఏఎస్ఐ రవి, హెడ్ కానిస్టేల్ హనీఫ్, కానిస్టేబుల్ రఘు, కుప్పారావు, గోపి, కేశవ, మారయ్య, అజిత్ లకు డీఎస్పీ రామరాజు రివార్డులు బహుకరించారు.
ద్విచక్రవాహనాల దొంగలకు రిమాండ్
Published Fri, Mar 24 2023 5:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement