శ్రీవారి సేవలో ఎంపీ వేమిరెడ్డి | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో ఎంపీ వేమిరెడ్డి

Published Wed, Nov 15 2023 1:26 AM

-

తిరుమల : తిరుమల శ్రీవారిని సోమవారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సేవించుకున్నారు. ఆయనకు అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. అధికారులు ఘనంగా లడ్డు ప్రసాదాలతో సత్కరించారు.

దూసుకొచ్చిన మృత్యువు

నాయుడుపేట టౌన్‌ : మండల పరిధిలోని బిరదవాడ గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కగా నడిచి వెళుతున్న ముగ్గురిపై కారు దుసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్‌(43) అనే వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం.. పట్టణ పరిధిలోని మునిరత్నం నగర్‌(మాలయకోట) ప్రాంతాని చెందిన దుర్గా ప్రసాద్‌ వంటమాస్టర్‌. బిరదవాడ గ్రామంలో వంట పని కోసం మునిరత్నం నగర్‌ ప్రాంతానికి చెందిన మస్తానయ్య, పవన్‌ను తీసుకుని రహదారి పక్కన నడిచి వెళుతున్నారు. అదే సమయంలో నెల్లూరు నుంచి చైన్నె వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న ఆ ముగ్గురిపై దుసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్‌ మృతి చెందగా.. మస్తానయ్య, పవన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

బస్సు అపహరించిన వ్యక్తికి జైలు

తిరుపతి లీగల్‌: తిరుమలలో టీటీడీకి చెందిన బస్సును అపహరించిన కేసులో తెలంగాణ, రంగారెడ్డి జిల్లా, హయత్‌నగర్‌ మండలం, చిరంజీవి రెడ్డి క్వార్టర్స్‌కు చెందిన నీలవర్‌ విష్ణుకు 3 నెలలు జైలు శిక్ష, రూ.100 జరిమానా విధిస్తూ తిరుపతి రెండోఅదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి పల్లపోలు కోటేశ్వరరావు మంగళవారం తీర్పు చెప్పారు.

క్యాన్సర్‌ రహిత జిల్లానే లక్ష్యం

తిరుపతి తుడా: క్యాన్సర్‌ ఫ్రీ జిల్లాను ఆవిష్కరించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు. దాతల సహకారంతో స్విమ్స్‌ ఆస్పత్రికి చేరుకున్న పింక్‌ బస్సును మంగళవారం డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్వీ కుమార్‌తో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేసే విధానం, పింక్‌ బస్సులో వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.

వీవీఆర్‌ ఫౌండేషన్‌ రూ.2.75 కోట్ల విరాళం

వీవీఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్‌ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో రూ.2.75 కోట్ల విలువ గల పింక్‌ బస్సును స్విమ్స్‌కు విరాళంగా అందించారని స్విమ్స్‌ డైరెక్టర్‌ తెలిపారు. డాక్ట ర్‌ జయచంద్రా రెడ్డి, డీఎంహెచ్‌ఓ శ్రీహరి పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయ వెలుపల ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి
1/2

శ్రీవారి ఆలయ వెలుపల ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి

శ్రీవారి ఆలయ వెలుపల ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి
2/2

శ్రీవారి ఆలయ వెలుపల ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి

Advertisement
Advertisement