Sakshi News home page

సముద్రంలో చేపల వేట రద్దు

Published Wed, Nov 15 2023 1:28 AM

శ్రీనివాస నాయక్‌, మత్స్యశాఖ జిల్లా అధికారి  - Sakshi

తిరుపతి అర్బన్‌ : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో చేపల వేటను రద్దు చేసినట్లు మత్స్యశాఖ జిల్లా అధికారి శ్రీనివాస్‌ నాయక్‌ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందన్నారు. ఈ నెల 17వ తేదీన తీరం దాగే క్రమంలో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు అప్పటి వరకు వేటకు విరామం ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. తీరంలో ఈదురుగాలులు వీచే ప్రమాదమున్నందున ముందస్తు జాగ్రత్తగా చేపల వేటను రద్దు చేసినట్లు వివరించారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారిని వెంటనే ఒడ్డుకు రప్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయాల్లోని మత్స్యకార సహాయకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తుపాను సమయంలో చేపలు తీరానికి భారీగా కొట్టుకువస్తుంటాయని, స్థానికులు వాటి కోసం వెళ్లి చిక్కుల్లో పడవద్దని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement