తిరుపతి రూరల్ : మండలంలోని చిరుగువాడలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆదివారం అబ్దుల్ కలామ్ జయంతిని పురస్కరించుకుని మెరిట్ విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు. సంకల్ప సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి పాల్గొని 205 మంది విద్యార్థులకు అవార్డులు అందజేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన సేగు రెడ్డెప్ప రెడ్డికు సేవారంగంలో సేవలకు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ గుంట లీలా ప్రసాద్రావుకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మెమోరియల్ అవార్డు ప్రదానం చేసారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ అబ్దుల్ కలామ్ పేరిట విద్యార్థులకు బాలశౌర్య, బాలశ్రీ, బాలరత్న అవా ర్డులు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించనున్నట్లు వెల్లడించారు. అబ్దుల్ కలామ్ జీవితం మనకు అందరికీ ఆదర్శనీయమన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన కలామ్ భారతజాతి గర్వించదగ్గ స్థాయికి ఎదిగారని కొనియాడారు. కలలు కనండి.. వాటి సాకారానికి కృషి చేయండి...అనే నినాదంతో ఎందరో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన మార్గదర్శకులని వివరించారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ సంకల్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత ఏడేళ్లగా ఉత్తమ విద్యార్థులను అభినందనందిస్తూ సభలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. టీటీడీ డీఈఓ భాస్కర్రెడ్డి మాట్లాడుతూ కఠోర దీక్షతో అబ్దుల్ కలామ్ తాను నిర్దేశించుకున్న గమ్యానికి చేరుకున్నారని తెలిపారు. నేటి యువతకు ఆయన గొప్ప రోల్మోడల్ అని వెల్లడించారు. డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్రెడ్డి మాట్లాడతుఊ విద్యార్థులు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి అలవాట్లు నేర్చుకోవాలని సూచించారు. సంకల్ప సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.రాజా రెడ్డి మాట్లాడుతూ అబ్దుల్ కలమ్ నిస్వార్థంగా సేవా నిరతితో జీవనం సాగించిన దార్శనికుడని కొనియాడారు. కార్యక్రమంలో మహమ్మద్రఫీ, విశ్వనాథరెడ్డి, డాక్టర్ వెంకటేశ్వర్లు, వెంకటరమణ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఓం ప్రకాష్ రెడ్డి, బాల సుబ్రమణ్యం, నగేష్, రాజేష్, బాలాజీ, అరుణకుమారి పాల్గొన్నారు.
మెరిట్ విద్యార్థులకు ‘కలామ్’ అవార్డులు
Published Mon, Nov 20 2023 12:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement