అనంతగిరి: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సోమవారం సాయంత్రం వికారాబాద్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలానికి చెందిన హరీష్కుమార్కు ఇద్దరు భార్యలు. ఇద్దరితోనూ అతనికి సఖ్యత లేదు. సోమవారం మద్యం మత్తులో హరీష్కుమార్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో స్థానికులు మంటలు ఆర్పి వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శీను తెలిపారు.
పడకల్లో మహిళ..
తలకొండపల్లి: ప్రజాప్రతినిధి దూషించాడని ఓ మహిళా ఆత్మహత్యకు యత్నించింది. మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన పద్మమ్మను ఓ ప్రజాప్రతినిధి అకారణంగా అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో తన ఇంట్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించింది. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుంది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు కుటుంబ సభ్యులు తెలిపారు.