ఘనంగా ఈదమ్మ జాతర | Sakshi
Sakshi News home page

ఘనంగా ఈదమ్మ జాతర

Published Sat, May 27 2023 6:12 AM

- - Sakshi

అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు

జల్దిబిందె కార్యక్రమంలో భక్తులు

దౌల్తాబాద్‌: మండల కేంద్రంలో ఈదమ్మ జాతర ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జల్దిబిందె కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం వేళ మహిళలు బోనాలతో తరలివచ్చారు. అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజలు చేశారు. జాతరకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ మహిపాల్‌, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, సర్పంచ్‌ శిరీష, ఎంపీటీసీలు, నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు.

1/1

Advertisement
Advertisement