మహేశ్వరం: మండల పరిధిలోని నందుపల్లి పంచాయతీలోని పల్లె ప్రకృతివనం, పంచాయతీ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ శుక్ర వారం సందర్శించారు. గ్రామంలో నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, ట్రాక్టర్, ట్యాంకర్తో పాటు నాటిన మొక్కలను ఆమె పరిశీలించారు. పంచాయతీ రికార్డులు, ఇప్ప టి వరకు విడుదలైన నిధులు, జరిగిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శుల రెగ్యులర్ అంశం గురించి పంచాయతీ కార్యదర్శుల వివరాలు,వారి పనితనం గురించి ఎంపీడీఓ, ఎంపీఓలను అడిగి తెలుసుకున్నారు. గ్రా మంలో అభివృద్ధి, పల్లె ప్రగతి పనులపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్