సొంత మండలంలో ‘పైలెట్‌’కు షాక్‌ | Sakshi
Sakshi News home page

సొంత మండలంలో ‘పైలెట్‌’కు షాక్‌

Published Tue, Oct 24 2023 8:06 AM

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్‌లతో మనోహర్‌రెడ్డి   - Sakshi

‘కారు’ దిగి కాంగ్రెస్‌ గూటికి చేరిన తొమ్మిది మంది సర్పంచ్‌లు

బషీరాబాద్‌: అధికార బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగిలింది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సొంత మండలం నుంచి తొమ్మిది మంది సర్పంచ్‌లు పలువురు ఎంపీటీసీ సభ్యులు, ఉప సర్పంచ్‌లు, నాయకులు ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మండలంలోని బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్‌ నేత మనోహర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు. మండలంలోని మాసాన్‌పల్లి, సర్పంచ్‌ భీమప్ప, ఉప సర్పంచ్‌ మల్లేశ్‌, గొట్టిగకుర్దు సర్పంచ్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, కుప్పన్‌కోట్‌ సర్పంచ్‌ పద్మ, భోజ్యానాయక్‌తండా సర్పంచ్‌ శాంతిబాయి, కొర్విచెడ్‌ ఘని సర్పంచ్‌ సునీత, ఉప సర్పంచ్‌ శ్వేత, బాబునాయక్‌ తండా సర్పంచ్‌ సూర్యానాయక్‌, హంక్యానాయక్‌ తండా సర్పంచ్‌ దేవసింగ్‌, బాద్లాపూర్‌ సర్పంచ్‌ సుభాష్‌, కంసాన్‌పల్లి సర్పంచ్‌ అనురాధ, ఉపసర్పంచ్‌ పద్మమ్మ, మంతట్టి ఎంపీటీసీ సభ్యుడు శ్రీధర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ గూటికి చేరారు. వీరిలో మంత్రి మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు వర్గం వారే ఉండడం గమనార్హం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల మాజీ అధ్యక్షుడు శంకరప్ప, యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు నరేష్‌, నాయకులు డాక్టర్‌ సంపత్‌కుమార్‌, శ్రీనివాస్‌రెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి తదితరులున్నారు.

Advertisement
Advertisement