రాష్ట్ర ఫలాలు రావుల కుటుంబానికే.. | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ఫలాలు రావుల కుటుంబానికే..

Published Wed, Nov 1 2023 4:18 AM

ప్రచారానికి విచ్చేసిన ప్రసాద్‌కుమార్‌కు స్వాగతం పలుకుతున్న రావులపల్లి గ్రామస్తులు  
 - Sakshi

మర్పల్లి: ప్రత్యేక రాష్ట్ర ఫలాలన్నీ రావుల కుటుంబమే అనుభవిస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ వికారాబాద్‌ అభ్యర్థి గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఆరోపించారు. మంగళవారం ఆయన మండల పరిధిలోనలి తిమ్మాపూర్‌, రావులపల్లి, కుడుగుంట, గుర్రంగట్టు తండా, పెద్దాపూర్‌, కల్‌ఖోడ, శాపూర్‌, దామస్తాపూర్‌, దామస్తాపూర్‌ తండా, బూచన్‌పల్లి గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల నాయకులు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. హస్తం గుర్తుకు ఓటేసి ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రవీందర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కొండల్‌రెడ్డి వికారాబాద్‌, మర్పల్లి మాజీ జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement