● కొడంగల్ నుంచి
రేవంత్రెడ్డి తరఫున గురునాథ్రెడ్డి..
● వికారాబాద్ నుంచి
కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్కుమార్..
● పరిగిలో స్వతంత్ర అభ్యర్థిగాశ్రీశైలం నామినేషన్ దాఖలు
అనంతగిరి/కొడంగల్/పరిగి: నామినేషన్ల ప్రక్రి య శుక్రవారం నుంచి ప్రారంభం కావడంతో తొలిరోజు వికారాబాద్, కొడంగల్, పరిగి అసెంబ్లీ స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వికారాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్కుమార్, కొడంగల్ నుంచి రేవంత్రెడ్డి తరఫున గురునాథ్రెడ్డి, పరిగిలో స్వతంత్ర అభ్యర్థిగా శ్రీశైలం నామినేషన్ వేశారు. వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో గడ్డం ప్రసాద్కుమార్ ముఖ్యనాయకులతో కలిసి రెండు సెట్ల నా మినేషన్లు వేశారు. కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, మాజీ చైర్మన్ సత్యనారాయణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కిషన్నాయక్, ఏఎంసీ మాజీ చైర్మన్ రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు. కొడంగల్ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తరఫున గురునాథ్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి, నాయకులు కృష్ణంరాజు, ప్రశాంత్, మహ్మద్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.పరిగిలో స్వతంత్ర అభ్యర్థి శ్రీశైలం నామినేషన్ వేశారు.