కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవద్దు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవద్దు

Published Tue, Nov 7 2023 5:22 AM

-

పరిగి: కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదని, ఆ పార్టీ నాయకులు ఇచ్చే హామీలకు గ్యారంటీ లేదని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం పట్ట ణంలోని 11వ వార్డులో ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు బూటకమన్నారు. కర్ణాటకలో ఇలానే చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. మూడో సారి రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ప్రజలు జీవన విధానం మారిందన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతోందని అన్నారు. రైతులు, పేదల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు వివరించారు. కాంగ్రెస్‌, బీజేపీ చెప్పే మాయమాటలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌కుమార్‌, ఎంపీపీ అరవింద్‌రావు, జెడ్పీటీసీ హరిప్రియ, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ భాస్కర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సురేందర్‌, కోఆప్షన్‌ జిల్లా మాజీ సభ్యుడు మీర్‌ మహ్మద్‌, నాయకులు ప్రవీణ్‌రెడ్డి, మునీర్‌, కృష్ణ, రవీందర్‌, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మూడో సారీ బీఆర్‌ఎస్‌దే అధికారం

ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి

Advertisement
Advertisement