ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా | Sakshi
Sakshi News home page

ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా

Published Tue, Nov 14 2023 4:18 AM

-

ఏఐఎఫ్‌బీ అభ్యర్థి విష్ణనువర్ధన్‌రెడ్డి

కేశంపేట: ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని తనను గెలిపిస్తే సంపాదించుకున్న ఆస్తిలో సగం నిరుపేదలకు రాసిస్తానని ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. ఆది, సోమవారం మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ, తూర్పుగడ్డతండా, ఇప్పలపల్లి, దేవునిగుడితండా, పోమాల్‌పల్లి, కొండారెడ్డిపల్లి, పుట్టోనిగూడ, దత్తాయపల్లి, గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నికల నోటిఫికేషన్‌ కంటే ముందే చాలా అభివృద్ధి కార్యక్రమాలను సొంత నిధులతో చేపట్టానన్నారు. 2వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించానని గుర్తు చేశారు. నియోజకవర్గంలో 5వేల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ను అందిస్తానని చెప్పారు. సంవత్సరానికి ప్రతి మహిళకు ఒక్క సిలిండర్‌ను ఉచితంగా అందిస్తానని వివరించారు. సింహం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఆయా కార్యక్రమాల్లో పసుల నర్సింహయాదవ్‌, నరేందర్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, పర్వతాలు, విఘ్నేష్‌,, ఆనంద్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement