దుర్మార్గపు పాలన అంతం కావాలి | Sakshi
Sakshi News home page

దుర్మార్గపు పాలన అంతం కావాలి

Published Wed, Nov 15 2023 4:28 AM

ప్రజలకు అభివాదం చేస్తున్న ఈటల రాజేందర్‌, నేతలు  
 - Sakshi

షాద్‌నగర్‌: రాష్ట్రంలో కొనసాగుతున్న దుర్మార్గపు పాలన అంతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం షాద్‌నగర్‌లో పార్టీ అభ్యర్థి అందె బాబయ్య ఆధ్వర్యంలో బీజేపీ విజయ గర్జన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఉద్యమకారుల ఆత్మత్యాగాల ఫలితంగానే తెలంగాణ వచ్చిందన్నారు. ఉద్యమ సమయంలో తనపై కూడా కేసులు పెట్టడంతో మహబూబ్‌నగర్‌ జైల్లో ఉన్నానని తెలిపారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తు ప్ర శ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పేదల నుంచి బలవంతంగా భూములు లాక్కొని పారిశ్రామికవేత్తలకు అప్పగిస్తోందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ ప్రజలను మద్యానికి బానిసలుగా మార్చారన్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం రూ.4,250కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రజలను కలవడం లేదని, ప్రగతి భవన్‌, ఫాంహౌస్‌లకు మాత్రమే పరిమితమయ్యాడని ఎద్దేవా చేశారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి హామీలు ఏమయ్యాయ ని ప్రశ్నించారు. బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేందుకు డబ్బు సంచులతో కుట్ర చేస్తున్నా రని ఆరోపించారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని, అందెబాబయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

కమలం.. కదనోత్సాహం

షాద్‌నగర్‌రూరల్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్‌నగర్‌ పట్టణంలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప సభ నిర్వహించారు. పట్టణ శివారులోని బాలాజీ టౌన్‌షిప్‌ సమీపంలో నిర్వహించిన సభకు పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ హాజరయ్యారు. జిల్లా నాయకులతో పాటు నియోజకవర్గ ముఖ్య నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సభకు జనం పెద్ద ఎత్తున తరలిరావడం.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఈటల మాటలతూటాలు పార్టీ శ్రేణుల్లోఉత్సాహం నింపాయి. మన తలరాత మారడానికి ఏకై క ఆయుధం ఓటు మాత్రమేనని, అలాంటి ఓటును అమ్ముకోవద్దని హితవుపలికారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రలోభాలకు లొంగకుండా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. కమలం పువ్వుకు ఓటువేసి అందె బాబయ్యను గెలిపించాలని కోరారు.

బీఆర్‌ఎస్‌ను నమ్మొద్దు..

పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన బీఆర్‌ఎస్‌ను నమ్మకుండా దేశాభివృద్ధికోసం అహర్నిశలు కృషి చేస్తున్న బీజేపీకి పట్టం కట్టాలని పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి అన్నారు. పార్టీ రాష్ట్ర క్యావర్గ సభ్యుడు శ్రీవర్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్‌ అబద్దాల పాలనలకు కాలం చెల్లిందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయరాజు, అసెంబ్లీ కన్వీనర్‌ డాక్టర్‌ విజయకుమార్‌, జిల్లా ఉపాధ్యక్షుడు కమ్మరి భూపాలాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్‌గౌడ్‌, జిల్లా ప్రచార కార్యదర్శి కక్కునూరి వెంకటేశ్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమకారుల

త్యాగాలతోనే తెలంగాణ

ప్రత్యేక రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా

నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తు

షాద్‌నగర్‌ బీజేపీ విజయగర్జన సభలో ఈటల రాజేందర్‌

Advertisement
Advertisement