అనంతగిరి: జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ క్లీన్స్వీప్ చేస్తుందని ఆ పార్టీ వికారాబాద్ అసెంబ్లీ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆనంద్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం వికారాబాద్ మండలం సిద్దులూర్, మదన్పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు బతుకమ్మ, బోనాలతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని, పార్టీ అభ్యర్థులు అఖండ విజయం సాధిస్తారని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని పేర్కొన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని తెలిపారు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ కోసం ముందుండి పోరాటం చేసిన కేసీఆర్ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని పేర్కొన్నారు. నేడు రాష్ట్రం సంక్షేమానికి మారుపేరుగా మారిందన్నారు. బీఆర్ఎస్తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమన్నారు. కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందాయని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధికి దూరమైందని అన్నారు. వికారాబాద్ సమస్యలను పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కరించినట్లు తెలిపారు. మరోసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కమాల్రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, సిద్దులూర్ ఎంపీటీసీ గౌసొద్దీన్, పార్టీ సీనియర్ నాయకులు రాఘవేందర్రెడ్డి, హరి మోహన్రెడ్డి, సంతోష్కుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం
బీఆర్ఎస్ వికారాబాద్ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆనంద్
మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి