తుదితీర్పు ప్రజానికానిదే.. | Sakshi
Sakshi News home page

తుదితీర్పు ప్రజానికానిదే..

Published Fri, Nov 24 2023 4:32 AM

-

ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి కాలె యాదయ్య, బీజేపీ నుంచి కేఎస్‌ రత్నం, కాంగ్రెస్‌ నుంచి పామెన భీంభరత్‌ చేవెళ్ల బరిలో నిలిచారు. దీంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో గతంలో కాంగ్రెస్‌కు కంచు కోట అయిన చేవెళ్లపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ పెద్దలు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన యాదయ్య మూడో సారి గెలిచేందుకు పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. ఈ సారి ఎలాగైనా గెలిచి తనసత్తా చాటాలని కేఎస్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా.. తుదితీర్పు ప్రజానికానిదే. చేవెళ్ల బాద్‌ షాగా ఎవరిని నిలబెడతారో చూడాలి మరి..

Advertisement
Advertisement