‘కారు’కు బ్రేక్‌ వేస్తాం.. కాంగ్రెస్‌కే ఓటేస్తాం | Sakshi
Sakshi News home page

‘కారు’కు బ్రేక్‌ వేస్తాం.. కాంగ్రెస్‌కే ఓటేస్తాం

Published Tue, Nov 28 2023 4:46 AM

-

ధారూరు: తమ భూములను లాక్కుంటున్న కారు పార్టీకి బ్రేక్‌ వేసి.. హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రసాద్‌కుమార్‌ను గెలిపిస్తామని ధారూరు మండల పరిధిలోని రాంపూర్‌తండా వాసులు ప్రతిజ్ఞ చేశారు. గిరిజన నాయకులు రాఘవన్‌నాయక్‌, రాంపూర్‌తండా సర్పంచ్‌ పాండునాయక్‌, కాంగ్రెస్‌ నాయకుడు రాజేందర్‌ సోమవారం గట్టెపల్లి, రాంపూర్‌తండాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవన్‌నాయక్‌ మాట్లాడుతూ.. రాంపూర్‌తండాకు చెందిన పలువురికి 600 ఎకరాలకు పట్టాలిస్తే.. 72 ఎకరాలను రెండు కంపెనీలకు బీఆర్‌ఎస్‌ నాయకులు కట్టబెట్టారని మండిపడ్డారు. భూములను లాక్కుంటున్న నాయకులకు బుద్ధి చెప్పి.. కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిపించాలని అభ్యర్థించారు.

మోమిన్‌కలాన్‌లో..

హస్తం గుర్తుకు ఓటేయాలని ముస్లిం నాయకులు ఓటర్లను కోరారు. మండల పరిధిలోని మోమిన్‌కలాన్‌, నాగారం గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌, మైనార్టీ రుణాలు, ఉద్యోగ కల్పనలో సీఎం కేసీఆర్‌ మోసం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షరీఫ్‌, మోసీన్‌ఖురేషి, ఇస్మాయిల్‌, జహీర్‌, ఆజాం, అన్సర్‌, మజీద్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement