సమస్యల పరిష్కారానికి వినతి | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి వినతి

Published Wed, Dec 13 2023 5:10 AM

-

అనంతగిరి: పెండింగ్‌ వేతనాలు, ఐడీ కార్డులు అందజేయాలని ప్రమోషన్‌ పొందిన వీఆర్‌ఏలు కలెక్టర్‌ నారాయణరెడ్డిని కోరారు. మంగళవారం వారు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. నాలుగు నెలలుగా విధులు నిర్వహిస్తున్నా నేటికీ ప్రభుత్వం జీతాలు చెల్లించక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని కోరారు.

బకాయి వేతనాలు చెల్లించండి

కొడంగల్‌ రూరల్‌: బకాయి వేతనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రమోషన్‌ పొందిన వీఆర్‌ఏలు కోరారు. ఈ మేరకు వారు మంగళవారం తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 81, 85జీఓల ద్వారా రెవెన్యూ డిపార్ట్‌మెంటులో జూనియర్‌ అసిస్టెంట్‌, రికార్ట్‌ అసిస్టెంట్‌, ఓఎస్‌లు నియామకం చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు వేతనాలు అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది సమ్మెకాలంలో మూడు నెలల వేతనాలు, ప్రస్తుతం ఐదు నెలల వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. నూతన ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరిస్తూ ఎంప్లాయీస్‌ ఐడీలతో బకాయి వేతనాలు చెల్లించాలని కోరారు.

Advertisement
Advertisement