సుస్థిర అభివృద్ధి వైపు విశాఖ పయనం | Sakshi
Sakshi News home page

సుస్థిర అభివృద్ధి వైపు విశాఖ పయనం

Published Sat, Mar 11 2023 9:36 AM

-

జాతీయ విపత్తుల నివారణ సదస్సులో మేయర్‌

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): న్యూఢిల్లీలో విజ్ఞాన భవనంలో జరుగుతున్న జాతీయ విపత్తుల నివారణ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ యూఎల్‌బీల తరఫున విశాఖ నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి హాజరయ్యారు. ఈ సదస్సును ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ సముత్ర తీరాన ఉన్న విశాఖ నగరం విపత్తులను తట్టుకుని, సుస్థిర అభివృద్ధి వైపు పయనించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ ప్రయత్నంలో ప్రభుత్వ అధికారులు, ఎన్జీవోస్‌, రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, మీడియా ప్రతినిధులు, నగర ప్రజల సహకారం అవసరమన్నారు. ఈ సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, యూనియన్‌ హోంశాఖ సెక్రటరీ అజయ్‌కుమార్‌ బల్ల, రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత, విపత్తుల నిర్వహణ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement