సర్కారు బడుల్లో సీబీఎస్‌ఈ బోధన..! | Sakshi
Sakshi News home page

సర్కారు బడుల్లో సీబీఎస్‌ఈ బోధన..!

Published Mon, Jun 5 2023 12:12 AM

-

విశాఖ విద్య: పేద విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించేలా తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో సరికొత్త చదువులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇంగ్లిష్‌ మీడియం చదువులకు ప్రాధాన్యత ఇస్తున్నందున ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ ప్రవేశపెట్టేలా జిల్లాలోని 19 స్కూళ్లను విద్యాశాఖాధికారులు ఎంపిక చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలో వీటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగానే ఎస్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో ముద్రించిన పాఠ్యపుస్తకాలు ఇప్పటికే జిల్లాకు సరఫరా అయ్యాయి.

కార్పొరేట్‌కు దీటుగా..

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 1,385 స్కూళ్లు ఉండగా, ఇందులో 3,72,134 మంది చదువుకుంటున్నారు. ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని 45 స్కూళ్లకు సీబీఎస్‌ఈ గుర్తింపు ఉండగా వీటిలో 36,454 మంది చదువుతున్నారు.

Advertisement
Advertisement