పోలీసుల అదుపులో గంజాయి సేవిస్తున్న యువకులు | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో గంజాయి సేవిస్తున్న యువకులు

Published Thu, Jun 8 2023 2:18 AM

-

సీతమ్మధార: కై లాసపురం ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను టాస్క్‌ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 70 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వివరాలివీ.. కై లాసపురంలోని ప్రాంతంలో బుధవారం స్వామి, ప్రదీప్‌లు గంజాయి సేవిస్తున్నట్లు సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ త్రినాథ్‌ ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడకు వెళ్లారు. వారిని అదుపులోకి తీసుకొని ఫోర్త్‌టౌన్‌కు అప్పగించారు. యువకులను సీఐ శ్రీనివాసరావు విచారించారు. గంజాయి విక్రయించే వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement
Advertisement