జాతీయ ఉత్తమ ఉపాధ్యాయినికి సన్మానం | Sakshi
Sakshi News home page

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయినికి సన్మానం

Published Fri, Sep 1 2023 12:56 AM

ఉమా గాంధీని సన్మానిస్తున్న ఉపాధ్యాయులు  - Sakshi

విశాఖ విద్య: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికై న డాక్టర్‌ ఉమాగాంధీని గురువారం ఏపీటీఎఫ్‌ అర్బన్‌ కమిటీ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ గురుపూజోత్సవం రోజున రాష్ట్రపతి చేతులమీదుగా ఆమె ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకోవటం గర్వకారణమన్నారు. డాక్టర్‌ ఉమాగాంధీ విద్యార్థులు అభ్యున్నతికి చేసిన కృషిని కొనియాడారు. సీతమ్మధార మండల శాఖ ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు దేముడుబాబు, సత్యనారాయణ, దుర్గా కుమారి, శ్రీవిద్య, అరుణ కుమారి, రామ సురేష్‌, విష్ణు వర్ధన్‌ నాయుడు, విశ్వేశ్వరరావు, రాజ్‌ కుమార్‌, రాము, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు

Advertisement
Advertisement