అప్పన్న సన్నిధిలో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ | Sakshi
Sakshi News home page

అప్పన్న సన్నిధిలో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ

Published Thu, Oct 5 2023 12:56 AM

కప్పస్తంభం వద్ద ప్రతాప్‌రావు జాద్వా  - Sakshi

సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని బుధవారం పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ టు కమ్యూనికేషన్స్‌ కాన్‌సిస్టింగ్‌ చైర్‌పర్సన్‌ ప్రతాప్‌రావు జాద్వా, సభ్యుడు పి.ఆర్‌.నటరాజన్‌ సంతోష్‌ పాండే దర్శించుకున్నారు. ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగం చేసుకున్నారు. వారి పేరిట అర్చకులు స్వామికి పూజలు చేసి, వేద ఆశీర్వచనం అందజేశారు. సంప్రదాయం ప్రకారం ఏఈవో భ్రమరాంబ స్వామివారి ప్రసాదం అందజేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ డీజీఎం జగదీశ్వరరావు, డీఈ రమేష్‌, ఎస్‌డీఈ భగవాన్‌ ధర్మాన, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement