రైల్వే స్టేషన్‌లో గంజాయి స్వాధీనం | Sakshi
Sakshi News home page

రైల్వే స్టేషన్‌లో గంజాయి స్వాధీనం

Published Thu, Nov 9 2023 12:22 AM

విశాఖ రైల్వేస్టేషన్‌లో అదుపులోకి తీసుకున్న గంజాయి నిందితుడితో జీఆర్పీ సిబ్బంది 
 - Sakshi

తాటిచెట్లపాలెం : విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో అక్రమంగా తరలిస్తున్న 18 కేజీల గంజాయిని గవర్నమెంట్‌ రైల్వే పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జీఆర్పీ సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ రైల్వే పోలీసు(డీఎస్‌ఆర్పీ) బి.మోహనరావు ఆదేశాలతో జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ సిహెచ్‌.ధనుంజయనాయుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐ జి.శ్రీనివాసరావు, జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ సిబ్బంది విశాఖ రైల్వేస్టేషన్‌లోని పలు ప్లాట్‌ ఫారాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సతీష్‌(30) బ్యాగును తనిఖీ చేయగా.. సుమారు 18 కేజీల గంజాయి బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు రైలులో ఈ గంజాయిని తీసుకెళ్తున్నట్లు నిందితుడు విచారణలో తెలియజేశాడు. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.

Advertisement
Advertisement