36 మంది ఎస్‌ఐలకు స్థానచలనం | Sakshi
Sakshi News home page

36 మంది ఎస్‌ఐలకు స్థానచలనం

Published Sat, Nov 11 2023 12:48 AM

ఎస్‌ఐల బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న నగర పోలీస్‌ కమిషనర్‌  రవిశంకర్‌ - Sakshi

దొండపర్తి: నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 36 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.రవిశంకర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీ ప్రక్రియను చేపట్టారు. అలాగే ఎస్‌ఐల పనితీరు, వారి సమస్యలను పరిగణలోకి తీసుకొని సాధ్యమైన మేర వారు కోరుకున్న చోట నియమించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సమస్యల్లో ఉన్న బాధితులకు అండగా నిలవాలని, సక్రమమైన, సమర్థవంతంగా విధులు నిర్వర్తించి పోలీస్‌ శాఖ ప్రతిష్ట పెంచాలని సూచించారు. డీసీపీ–1 కె.శ్రీనివాసరావు, డీసీపీ–2 కె.ఆనందరెడ్డి, ఏడీసీపీ(క్రైం) గంగాధరం, ఏడీసీపీ(ట్రాఫిక్‌) శ్రీనివాసరావు తదితరులు కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టారు. ప్రాధాన్యతల ప్రకారం బదిలీలు చేయడం పట్ల ఎస్‌ఐలు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement